Saturday, March 20, 2010

మత యుద్దాలు - మారణ హొమాలు - బాధ్యులెవరు?


మీరు కారణ జన్ములు. ఈ  బ్లాగ్  వీక్షిస్తున్న మీకు  ప్రత్యేక  ధన్యవాదాలు.   మీరు కారణ జన్ములంటే బహుశా  నమ్మకం  కలుగటం  లేదేమో.   ఆ మాటకొస్తే  మీరే  కాదు  ప్రతి  మనిషి  కారణజన్ముడే (జన్మురాలే).  అది తెలియక అకారణంగా ఎందరో అంతరించారు అంతరిస్తూనే ఉన్నారు.   కొందరు మాత్రమే  పైకి  రాగలిగారు  శాశ్వతంగా  చరిత్ర  పుటల్లో మిగిలిపోయారు.     ఒకసారి గమనించండి. ఈ బ్లాగ్ లోకి  ప్రవేశించక  ముందు  మీ  ఆలోచన  ఎలాంటిది? ఎలాఉంది?  మీకు  తెలియకుండానే  ఏదో తెలుసుకోవాలనే తపన ఉండిఉంటుంది  కదూ.  ఆ  తపనే  ప్రతి  మనిసిలొనూ  ఉండేది.  అందుకే కదా  అది  బిగ్బాంగ్  వరకు  వెళ్ళింది.  ఇక  విషయానికి  వద్దాం.  అనవసరమైన  ద్వేషం  లేకుండా  సహృదయంతో  పరిశీలించండి:     


కొంతకాలం  క్రితం  హిందూ ధర్మ  జాగరణ  సమితి  పేరిట  కొందరు  కొన్ని  ప్రశ్నలు  లేవనెత్తారు.  దానికి జవాబుగా  క్రైస్తవ  పరిషత్  పేరిట  సమాధానాలు ఇచ్చారు. ఆసక్తికరమైన  ఈ  ప్రశ్నోత్తరాలు  గమనిద్దాం. 

జాగరణ  సమితి  ప్రశ్న: 


ఒక చేత్తో కత్తి,  ఒక చేత్తో బైబుల్ పట్టుకుని మతయుద్ధాలు చేసి, కోట్లాదిమంది  గొంతులు కోసి,  రక్తాన్ని ఏరులై  పారించిన  ఘనత  మీ  మతానిది  కాదా!

పరిషత్  సమాధానం:


నిష్కారణంగా, అనవసరంగా, ప్రజలను  హతమార్చి  రక్తపుటేరులు  పారించిన  వ్యక్తులు అన్ని మతాలలొనూ ఉన్నారు.  అలంటి కొందరు నాస్తికులు కూడా ఉన్నారు. ఒక మతంలోని వ్యక్తులు తప్పు చేసినంత  మాత్రాన  ఆ  మతం  తప్పు  చేసినట్టు  కాదు.  క్రైస్తవ మతస్థులు  కొందరు  అనవసర  రక్తపాతం జరిగించిన  మాట  వాస్తవమే.  అయితే  అలా చేయమని  బైబుల్  చెప్పలేదు.  ఏసుక్రీస్తు  ప్రభువు చెప్పలేదు.  అందుచేత  అది  క్రైస్తవ మతం  చేసిన  తప్పు  కాదు;  క్రైస్తవ  మతం  లో  ఉంటూ  క్రీస్తు భోదనలను పెడచెవిని పెట్టిన నకిలీ క్రైస్తవుల చేత  ఆ  రక్తపాతం  జరిగింది.  అలాంటి  వ్యక్తులు వాస్తవానికి  క్రైస్తవులు  కారు.  వారి  ప్రవర్తన  క్రైస్తవ  మత  సిద్దాంత  ప్రకారమైనది  కాదు.

జాగరణ సమితి ప్రశ్న:


'మంత్ర గత్తె' లు అనే  నెపంతో లక్షలాది మంది అమాయక  స్త్రీలను నిర్దాక్షిణ్యంగా  చంపినా  ఘనత  మీ మతానిది కదా!

పరిషత్ సమాధానం:


ఈ ప్రశ్నకు కూడా పై జవాబే వర్తిస్తుంది.  అలా మంత్రగత్తెలను  చంపమని  ఏసుక్రీస్తు ఆదేసించలేదు.  అసలు ఏ కారణం చేతనైనా నరహత్య  చేయకూడదని  బైబుల్ స్పష్టంగా అజ్ఞాపిస్తుంది.  ఆ మాట  కొస్తే  మంత్రగత్తెలు, మంత్రగాళ్ళు అనే  నేరం మోపి  కొందరు వ్యక్తులను  రాళ్లతో,  కర్రలతో  కొట్టి  చంపుతున్న సంఘటనలు  భారత దేశంలో   పల్లెలలో కూడా   ఎన్నో  జరుగుతున్నాయి.  అలా  చంపుతున్న  వారు  క్రైస్తవులు  కారని  మీకు తెలుసు.  ఏదిఏమైన  ఒక  మతంలోని  వ్యక్తులు  చేసే  అజ్ఞానపు  పనులు  ఆ మతం లోని దైవావతారానికి, మతగ్రంధానికి  మనం  ఆపాదించకూడదు.   ఈ  సూత్రం  అన్ని మతాలలోని  వ్యక్తులకు  వర్తిస్తుంది. 


(ఓపిగ్గా ఇంతవరకూ చదివిన మీకు మరోసారి ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఎన్నో ఉన్నాయి.  ఇంకా మరికొన్ని మరలా కలిసాక) 
  

Friday, March 19, 2010

ఉపోద్ఘాతం-పరిచయం

   ఈ బ్లాగును ప్రోరంభించాలనే తలంపు కేవలం సాటి మనుషులలో అపోహలు తొలగించటానికే. ప్రతి మనిషికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. దేవుని నమ్మే వారు దైవభక్తి సాధన చేయాలనీ, నమ్మని వారు బహుశా నాస్తికులైనా తమ సిద్దంతాలపై నమ్మక ముంచుతారు సిద్ధాంత కర్తలపై కొంతైన భక్తి భావం ప్రదర్శిస్తారు. ఇక సైన్స్ విషయాని కొస్తే ప్రతిదానికి రుజువు కావాలంటుంది. క్రొత్త రుజువులు దొరికితే పాతవి గతిస్తాయి. ఎవరి నమ్మకం వారిది ఎవరి సిద్దాంతం వారిది ఎవరి రుజువులు వారివి. ఎవరు ఎవరినీ ద్వేషించ నవసరం కాని దూషించ నవసరం కాని లేవు. మానవ జాతి ఆరంభం నుండి మతం పేరుతో అనేక అరాచకాలు జరిగాయి. కొందరు వందేమాతరం పాడటం మా మత విశ్వాసాలకు భంగం కలిగిస్తున్నది. ఎందుకంటే మేము తల్లిని గౌరవిస్తాం కానీ పూజించం. దేవుణ్ణి తప్ప దేశమాతనైనా పూజించం అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మతమార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలతో హింసకు గురికా బడుతున్నారు. మనిషికి కావాల్సింది మతమో తాను నమ్మిన దైవమో తేల్చుకోలేక దైవన్వేషకులు సతమత మౌతున్నారు. మతవిశ్వాసాలు దేవునిపై నమ్మకం మనసులో ఉదయించేవి కాని శరీర సంబందమైనవి కావని అందరికి తెలుసు. ఇక చుట్టూ జరిగే అరాచకాలు చూసి దైవత్వాన్నే శంకించే పరిస్థితి మరి కొందరిది.


    మూఢ త్వం, గ్రుడ్డితనం, అరాచకం, మొదలుగునవి ఎక్కడ వున్నా ఖండించాల్సిందే. ఐనా మానవుని లోని జిజ్ఞాస చావదు. ప్రయత్నం వీడడు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి సృష్టి ఆరంభ రహస్యాన్ని తెలుసుకోవాలని బిగ్బాంగ్ ప్రయోగానికి సంనద్ధమైయ్యారు. ఐతే వీటికి మూలం ఏమిటి? వాస్తవం ఏమిటి?. ఏది సత్యం? ఏదసత్యం? తెలిసింది తెలుసుకున్నది పంచుకోవాలనే తలంపుతో ఈనా ప్రయత్నం. కొందరు క్రైస్తవ విశ్వాసాలను కించ పరుస్తుంటే ఎందుకో తీరని వ్యధ కలుగు తుంది. ఇటీవల ప్రతి మతం వారు తమది మతం కాదు జీవిత విధానమే నని చెప్పుకుంటున్నారు. దేవుణ్ణి తెసుకోవాలంటే తమకు నచ్చింది తమ దైన శైలిలో అనవసరంగా మరొకరిని కించ పరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఏ మతాన్ని కాని సంస్కృతిని కాని దేశాన్ని కాని కించ పరచే ఎలాంటి ఆలోచన నాకు లేదు రాబోదు.


     మంచి ఎక్కడున్నా గ్రహించాలని సత్యమెక్కడున్నా స్వీకరించాలని జ్ఞాన మెక్కడున్నా సముపార్జించాలని తృష్ణ గొని ఉన్నా. అన్యధా భావించకుండా సత్యమేదో సమస్తమైన వారలు గ్రహించాలని గ్రహించి మీకు తెలిసిన సత్యాలు తెలియజేయ గలరని ఆశిస్తున్నా. అపోహలు తొలగాలని, సుహృద్భావ వాతావరణం నెలకొనాలని, ద్వేష బీజాలు నశించాలని ప్రారంభిస్తున్నా. నేను నేర్చుకునే వాడినే. చదువరులకు ప్రత్యేకించి విమర్శకులకు ఇదే నా ప్రత్యేక ఆహ్వానం. మీ స్పందన నాకు అమూల్యం.


(ప్రస్తుతానికి ఈ ఉపోద్ఘాతం ఆపి ప్రశ్నోత్తరాలతో మళ్లీ కలుద్దాం)